Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Thu Jun 27 14:50:07 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
Advanced Search

News Posts by Naagendra V

Page#    Showing 1 to 5 of 37 news entries  next>>
Jun 22 (09:45) Amravati: మూడు మార్గాలూ డబుల్‌ లైన్లతోనే అమరావతికి న్యాయం (www.eenadu.net)
12105 views
1

News Entry# 557197   
  Past Edits
Jun 22 2024 (21:18)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌...

Rail News
9559 views
0

Jun 22 (21:20)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6102773-1               Past Edits
Article source :

రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్‌ లైన్‌తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్‌ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే..
...
more...
ఇదంతా సాధ్యంఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్‌ లైన్‌తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రాజెక్టు అసలు స్వరూపమిది..

అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్‌లో ఇది డబుల్‌ లైన్‌ ఉండగా, సింగిల్‌ లైన్‌కే పరిమితం అవుతున్నారు. 
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..

రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్‌పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్‌కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

106 కి.మీ. డబుల్‌ లైన్‌ నిర్మిస్తేనే..

రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్‌ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్‌లైన్‌కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్‌ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి

మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్‌లైన్‌కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.

మూడు లైన్లతో మేలు జరిగేదిలా..

1 ఎర్రుపాలెం-నంబూరు లైన్‌తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్‌ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్‌కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్‌ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్‌లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.

2 అమరావతికి దగ్గరి మార్గం.

సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్‌ లైన్‌ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్‌ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్‌ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

3 సీమ నుంచి నేరుగా రాజధానికి..

రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్‌ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్‌ లైన్‌లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్‌-గుంటూరు పాతలైన్‌లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jun 07 (08:49) Resurgence of BJP in Andhra Pradesh comes as a surprise (www.thehindu.com)
15404 views
0

News Entry# 555037   
  Past Edits
Jun 07 2024 (08:49)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jun 07 2024 (08:49)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Jun 07 2024 (08:49)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
The Assembly election results in Andhra Pradesh have taken everyone by surprise. None expected that Y.S. Jagan Mohan Reddy’s YSR Congress Party (YSRCP) would slip from...

Rail News
13950 views
0

Jun 07 (08:52)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6087006-1              
posting only railway related content.
Translate to English
Translate to Hindi

13372 views
1

Jun 07 (09:01)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6087006-2              
Mr. Vishnu Kuma Raju’s , Can focus on Start the operations of SCOR immediately with available infrastrure instead of building constructions. as we know Building construction will take time. SCOR operations already delayed.
Translate to English
Translate to Hindi
Jun 02 (14:56) ఫాస్ట్‌ పాసింజర్‌ విజయవాడ వరకే (www.eenadu.net)
4875 views
0

News Entry# 554483   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్‌ పాసింజర్‌ రైలు జూన్‌ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ట్రాక్‌ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను...
Jun 01 (08:08) Tirupati: రైలుబండి రద్దవుతోంది.. వేసవిలో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు (www.eenadu.net)
16448 views
0

News Entry# 554346   
  Past Edits
Jun 01 2024 (08:08)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jun 01 2024 (08:08)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158

Jun 01 2024 (08:08)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Jun 01 2024 (08:08)
Train Tag: Padmavathi SF Express/12764 added by NaagendraV/309158

Jun 01 2024 (08:08)
Train Tag: Chennai Suburban Terminal - Tirupati MEMU Special/06727 added by NaagendraV/309158
వేసవి సెలవుల్లో కీలకమైన రైళ్లు రద్దు కావడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
తిరుపతి...
May 18 (15:48) నాలుగు లైన్లుగా.. (www.andhrajyothy.com)
42872 views
0

News Entry# 552715   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన...

Rail News
39373 views
0

May 18 (15:49)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6068492-1            Tags   Past Edits
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను చేపట్టింది.

...
more...
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను చేపట్టింది.



ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) జరుపుతున్న రైల్వే అధికారులు



విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్‌ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్‌లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్‌లో విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్లు అతి ముఖ్యమైనవి. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా కనెక్టివిటీకి గూడూరు సెక్షన్‌, విజయవాడ నుంచి విశాఖపట్నం జిల్లా కనెక్టివిటీకి దువ్వాడ సెక్షన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్గంలో ఉన్నంత రద్దీ అంతా ఇంతా కాదు. ఈ గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ను ఈ సెక్షన్ల నడుమే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

శరవేగంగా..

సరుకు రవాణా రంగంలో విజయవాడ డివిజన్‌ సత్తా చాటుతోంది. మునుపెన్నడూ సాధించనంత రూ.5,600 కోట్ల పైబడి ఆదాయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించింది. దీనికి ప్రధాన కారణం పోర్టులు ఉండటమే. కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సింహభాగం ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్‌ సాధించింది. ఈ రెండు సెక్షన్ల మధ్య కొత్తగా మరో నాలుగు పోర్టుల పనులు కూడా జరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోర్టులకు కనెక్టివిటీ ఏర్పడితే రద్దీ లే కుండా చూసుకోవాల్సిన అంశాలపై రైల్వే ముందుచూపుతో క్వాడ్రలైన్‌పై దృష్టి సారించింది. అందుకే విజయవాడ-దువ్వాడ, విజయవాడ-గూడూరు సెక్షన్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రైల్వేబోర్డు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయవాడ-గూడూరు సెక్షన్‌లో ప్రస్తుతం ట్రిప్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గూడూరు నుంచి చుండూరు వరకు ట్రిప్లింగ్‌ పనులు పూర్తి కావటంతో పాటు ఫంక్షన్‌లోకి కూడా వచ్చింది. చుండూరు నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు 30 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న అవసరాల దృష్ట్యా ఈ సెక్షన్‌లో నాల్గోలైన్‌ కూడా ఏర్పాటు చేయాలన్నది రైల్వే అధికారుల ఆలోచన. ఇక విజయవాడ-దువ్వాడ మధ్య ప్రస్తుతం డబ్లింగ్‌ మాత్రమే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధానమైన సెక్షన్‌ ఇది. అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్‌లో మూడోలైన్‌ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే అధికారులు మూడో లైన్‌తో పాటు నాలుగో లైన్‌ ఆలోచన చేయటం కూడా మంచి విషయం. లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను ప్రస్తుతం రైల్వే చేపడుతోంది. రైల్వేబోర్డు ఆమోదంతో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.

#andhraRailwayInfra #BZA #Scr

Translate to English
Translate to Hindi

15692 views
0

May 18 (16:20)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6068492-2              
Since 4 new ports are being constructed, Railways should consider constructing the new railway line.

1.machilipatnam -repalle-bapatla
2.Ongole-kanigiri-giddaluru(something like)
3. Rajahmundry to Raipur (which was proposed in the 2010 budget, if I'm not wrong)
...
more...

4. Bye pass line around BZA

Translate to English
Translate to Hindi

12892 views
0

May 18 (17:21)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15272 blog posts
Re# 6068492-3              
Nadikudi - Srikalahasti line ippativaraku aithe Darsi varaku complete ayyindhi.

Inka cheyyalsindhi chaala undhi work.
Translate to English
Translate to Hindi

11481 views
0

May 18 (18:31)
deepak.yerr~
deepak.yerr~   6345 blog posts
Re# 6068492-4              
1.They should first connect ongole with Darsi so that Ongole Secunderabad distance reduces by 80km bypassing Guntur then Ongole Giddalur. They should lay new lines strategically that they reduce distances to metro cities. Ongole Hyd distance is 330km by road and are being covered in 5.5-6 hrs by buses coming from Chennai.

2. They should construct VJA Bypass from Diggirala to Gudivada line and further to Veeravalli in Duvvada section and should be double line.
Translate to English
Translate to Hindi

8827 views
0

May 20 (22:22)
NaagendraV
NaagendraV   331 blog posts
Re# 6068492-5              
Yes , In andhra pradesh most of the railway projects are delayed due to various reasons. I think this project will complete as expected since project funding by central, here state government only responsible for acquire the land.
Translate to English
Translate to Hindi
Page#    37 news entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy